EPAPER

Manickam Tagore: ఏపీలో ముగిసిన మాణికం ఠాకూర్ పర్యటన.. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు షర్మిలకు ఖాయమా ?

Manickam Tagore: ఏపీలో ముగిసిన మాణికం ఠాకూర్ పర్యటన.. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు షర్మిలకు ఖాయమా ?

Manickam Tagore: ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణికం ఠాకూర్‌ మూడు రోజుల ఏపీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరారు. వైఎస్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరిక తర్వాత ఆమెకు అప్పగించే పార్టీ బాధ్యతలపై విస్తృతంగా చర్చలు జరుపుతోంది కాంగ్రెస్‌. ఈ మేరకు పలువురు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి నాయకుల అభిప్రాయాలను సేకరించారు మాణిక్యం ఠాకూర్‌. ఈ నివేదికను ఇవాళ ఢిల్లీ అధిష్టానానికి వివరించనున్నారు. కాగా.. ఈ రెండు మూడు రోజుల్లోనే ఏపీపీసీసీ చీఫ్‌గా షర్మిలను ప్రకటించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నెల 18న కాంగ్రెస్ ఏపీ అధ్యక్షరాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. అయితే.. షర్మిలకు పీసీపీ పగ్గాలు ఇవ్వొందంటూ వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్‌.


కర్ణాటక, తెలంగాణలో విజయదుందుబి మోగించిన కాంగ్రెస్‌ పార్టీ ఏపీలోపై ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలో 10 ఏళ్లనాటి పూర్వ వైభవం తీసుకురావాలని.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించి అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు వ్యూహాలకు పదునుపెట్టి ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్‌లో వైఎస్‌ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించి ఆమె సోదరుడైన జగన్‌ను ఓడించి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తుగడలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.


Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×