AP Congress: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని పలువురు అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఏపీలోని 9 స్థానాలకు గాను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా వెల్లడించారు.
1.శ్రీకాకుళం- డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు
2.విజయనగరం- బొబ్బిలి శ్రీను
3.అమలాపురం(ఎస్సీ)- జంగా గౌతమ్
4.మచిలీపట్నం- గొల్లు కృష్ణ
5.విజయవాడ- వళ్లూరు భార్గవ్
6.ఒంగోలు- సుధాకర్ రెడ్డి
7.నంద్యాల- జాగంటి లక్ష్మీ నరసింహ యాదవ్
8.అనంతపుర్- మల్లికార్జున్ వజ్జాల
9.హిందూపురం- షమద్ షహీన్
కాంగ్రెస్ హైకమాండ్ గతంలో 14 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితాతో కలిపి ఇప్పటి వరకు 23 లోక్ సభ స్థానాలకు అభ్యర్థలను ఖరారు చేసింది. రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ.. రెండు స్థానాలను వామపక్షాలకు కేటాయించింది.
Also Read: టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు.. 5 స్థానాల్లో అభ్యర్థులు మార్పు
అయితే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఏపీలోని ఎంపీ అభ్యర్థులతో పాటుగా జార్ఖండ్ లో మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. జార్ఖండ్ లోని రాంచీ, గొడ్డా లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.