EPAPER

Jagan : సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?

Jagan : సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?

Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. మే చివరి వారంలో జగన్ ఢిల్లీ వెళ్లారు. అప్పుడు వారంరోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు మరోసారి హస్తినకు సీఎం జగన్ వెళ్లారు.


ఢిల్లీ­లోని జనపథ్‌–1 నివాసానికి జగన్ చేరుకున్నారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలుస్తారని తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో చర్చిస్తారని సమాచారం.

మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను జగన్ కలుస్తారని తెలుస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారని సమాచారం. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశమవుతారు. బుధవారం రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. గురువారం కేంద్ర జలశక్తి మంత్రి, అందుబాటులో ఉన్న ఇతర కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వస్తారు.


రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ అంశాలను ప్రధానంగా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×