EPAPER

AP CID: బిగ్ బ్రేకింగ్.. సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ.. రఘురామ ఫుల్ ఖుషీ?

AP CID: బిగ్ బ్రేకింగ్.. సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ.. రఘురామ ఫుల్ ఖుషీ?

AP CID: బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. ఆయన వెంటనే రిలీవ్ కావాలని.. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సునీల్ కుమార్ బదిలీకి కారణాలు ఇంకా తెలియరాలేదు.


ఏపీ సీఐడీ చీఫ్ గా సంజయ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఫైర్ సర్విసెస్ డీజీగా ఉన్నారు సంజయ్.

ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ పై ఇన్నాళ్లూ అనేక రాజకీయ విమర్శలు వచ్చాయి. వైసీపీ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ అమలు చేశారనే విమర్శలు బలంగా వినిపించాయి. జగన్ తొత్తుగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పని చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు గుప్పించేవి.


ఇక, వైసీపీ ఎంపీ రఘురామ ఎపిసోడ్ లో సునీల్ కుమార్ పేరు మారుమోగిపోయింది. ఎంపీ రఘురామను హైదరాబాద్లో అరెస్ట్ చేసి.. బలవంతంగా ఏపీకి తరలించి.. పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీతో తనను టార్చర్ చేశారంటూ రఘురామ ఆరోపించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వీడియో కాల్ లో చూస్తూ.. తనను తీవ్రంగా కొట్టించారని చెప్పడం సంచలనంగా మారింది. జగన్ కళ్లలో ఆనందం కోసమే సునీల్ తనను టార్చర్ చేశారని మండిపడ్డారు. పాదాలకు అయిన గాయాలను కోర్టులో ప్రదర్శించారు రఘురామ. ఆ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం.. ఆ సమయంలో కొన్ని వారాల పాటు రఘురామ, సునీల్ వ్యవహారం హాట్ టాపిక్ గా నడిచింది.

మరోవైపు, సునీల్ చేసిన కొన్ని మతపరమైన వ్యాఖ్యలపైనా రఘురామ సుప్రీంకోర్టులో కేసు వేయడం.. ఆ వీడియోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సునీల్ డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సునీల్ ను ఏపీ సీఐడీ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో.. ఈ న్యూస్ అందరికంటే ఎంపీ రఘురామకృష్ణరాజుకే ఎక్కువ సంతోషం ఇచ్చి ఉంటుంది. సునిల్ ను బదిలీ చేయడంతో ప్రతిపక్షాలూ పండగ చేసుకుంటున్నాయి.

సునీల్ కుమార్ పై కోర్టులో ఫ్యామిలీ కేసు కూడా నడుస్తోంది. భార్యతో విడాకుల కేసు, ఆమె పుట్టింటి వారిని వేధించారనే ఆరోపణలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.

Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×