AP Budget Session updates(Political news in AP): ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడంపై ఆర్థిక శాఖ తర్జనభర్జన పడుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
మరో నాలుగు నెలలపాటు ఓటాన్ అకౌంట్ కొనసాగేలా ఆర్డినెన్స్ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని యోచిస్తున్నట్లు సమాచారం. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తున్నది.
Also Read: ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..?
ఇదిలా ఉంటే.. ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత.. తొలి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ తోపాటు శాసనసభకు ఎన్నికైనా ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.