AP Fake Votes: ఏపీలో నకిలీ ఓట్లపై గతం కొంతకాలంగా చర్చ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎంట్రీతో తిరుపతి నకిలీ ఓట్ల పంచాయితీ ఈసీ వరకు చేరింది. తిరుపతి పార్లమెంట ఉపఎన్నిక, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నకిలీ ఓట్లతోనే గెలిచిందని పురందేశ్వరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హతలు లేని వారు ఓటు హక్కు పొందారని ఈసీకి చేసిన ఫిర్యాదులో ఆమె వివరించారు.
పురందేశ్వరి ఫిర్యాదుతో ఈసీ అధికారులు మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ జరపాలని తెలిపారు. అయితే.. ఫేక్ ఓట్లపై తమ దగ్గర సాక్ష్యాధారాలు లేవని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో ముగ్గురు ఫేక్ ఓట్లర్లను పోలీసులు గుర్తించారు. అందులో ఇద్దరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కాగా.. మరొకరు విజయ అనే మహిళ అని పోలీసులు తెలిపారు. అయితే.. వేలాది మంది ఫేక్ ఓటర్లు ఉంటే.. ముగ్గురిని గుర్తించి చేతులు దులుపుకుంటున్నారని అధికారులపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
.
.