EPAPER

AP Assembly Sessions: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం

AP Assembly Sessions: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం

AP Assembly Sessions Land Titling Act: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలకు దోహదం చేసిందన్నారు. ముఖ్యంగా భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారన్నారు. భూమి అనేది తరతరాలుగా వారసత్వం నుంచి వస్తుందన్నారు.

ప్రభుత్వం ముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కానీ సీఎం ఫొటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇటీవల భూ సర్వే అన్నారని, ఎక్కడికక్కడ వివాదాలు పెంచేశారన్నారు. ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు.


ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభించారు. అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×