Republic Day : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ సీఎం జగన్ దంపతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Andhra Pradesh : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ సీఎం జగన్ దంపతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతిఒక్కరి పాత్ర ఉండాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఐకమత్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వైద్య సేవలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ క్లీనిక్లను ప్రారంభించామన్నారు. రైతుల కోసం 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పరిపాలన సులభతరం చేయాటానికి నూతన జిల్లాలు ఏర్పాట్లు చేసామన్నారు. కుల, మత, ప్రాంతాలకు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు ప్రతి పౌరునికి చేరేలా కృషి చేస్తున్నామన్నారు. పాఠశాలలో నాడు- నేడు పథకంతో అనేక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. పాలన పరంగా అనేక సంస్కరణలు చేశామని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.