CM Ramesh angry on Officers: అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వార్తల్లోకి వచ్చేశారు. తనిఖీకి వచ్చిన జీఎస్టీ అధికారులను ఆయన అడ్డుకోవడంపై చర్చ మొదలైంది. అంతేకాదు అధికారులను బెదిరించారట. అసలేం జరిగింది? ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలోని చోడవరం ఇందుకు వేదికైంది.
బుజ్జిబాబు ట్రేడర్ టైల్స్ కార్యాలయానికి జీఎస్టీ అధికారులు తనిఖీకి వచ్చారు. జీఎస్టీ కట్టకుండా పెద్ద మొత్తంగా ఈ కంపెనీ లావాదేవీలు జరిపినట్లు అధికారులకు సమాచారం వెళ్లింది. ఈ క్రమంలో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ప్రచారం ఉన్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్కు జీఎస్టీ అధికారులు చెక్కింగ్కు వచ్చారన్న విషయం తెలిసింది. కార్యకర్తలతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న అధికారులను ఆయన అడ్డగించే ప్రయత్నం చేశారు.
అంతేకాదు ప్రభుత్వానికి సంబందించిన కీలక ఫైళ్లను ఆయన తనతో తీసుకెళ్లినట్టు వార్తలు జోరందుకున్నాయి. దీంతో అధికారులకు-సీఎం రమేష్ మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read: జగన్పై చెల్లెళ్ల యుద్ధం.. ప్లాన్ అంతా రెడీ..!
రెచ్చిపోయిన సీఎం రమేష్…
అనకాపల్లి జిల్లా చౌడవరం లో జీఎస్టీ అధికారుల తనిఖీలను అడ్డుకున్న సీఎం రమేష్
చోడవరం లో నీ బుజ్జి బాబు ట్రేడర్ టైల్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారుల తనిఖీలు
సీఎం రమేష్ కార్యకర్తలతో వచ్చి అధికారాలను బెదిరించి వైనం
ప్రభుత్వం కు సంభందించిన కీలక ఫైల్స్… pic.twitter.com/CtQ1zdocf4
— BIG TV Breaking News (@bigtvtelugu) April 5, 2024