టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని అంబటి మండిపడ్డారు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రా కదలిరా అంటే వచ్చేవారెవరూ లేరంటూ అంబటి ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే వ్యక్తి చంద్రబాబు అని రాంబాబు మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కు ప్రజాదరణ లేదని.. ఎన్నికల తర్వాత వారు హైదరాబాద్కు పోవాల్సిందేనని అంబటి విమర్శించారు. అఫీషియల్, అనఫీషియల్గా పొత్తులు పెట్టుకోవటం పవన్కు అలవాటేనని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ఇచ్చినమాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదే అని, ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇన్నాళ్లు కుప్పంను ఎందుకు పట్టించుకోలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే కుప్పంలో ఎయిర్ పోర్టు కడతానంటున్నారని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.