Alluri Seetharamaraju District : ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపం చెంది పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన అటెండర్కు టిఫిన్ తీసుకురమ్మని చెప్పారు. అటెండర్ టిఫిన్ తీసుకొని వచ్చి చూసే లోపు తహసీల్దార్ ఉరి వేసుకొని ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం పాడేరు కలెక్టరేట్లో అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూముల రీసర్వే విషయమై అధికారులు తహసీల్దార్ శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి తహసీల్దార్ మనస్తాపంతో ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణం కూడా అదేనని తెలుస్తోంది. అయితే తహసీల్దార్ అసలెందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాలు అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు.