MLC ElECTIONS: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునేందుకు ఇటు అధికార పార్టీ.. అటు విపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అలాగే ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఎన్నికల కోసం మొత్తం 331 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అనకాపల్లిలో 49, విజయనగరంలో 72, అల్లూరిలో 15, శ్రీకాకుళంలో 59, మన్యం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు మొత్తం రెండు లక్షల తొమ్మిది వేల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే వారికి ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేశారు.