Central Government partitioned AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన ఎట్టకేలకు పూర్తైంది. ఈ ప్రక్రియ పూర్తైనట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.ఏపీకి 11.566 ఎకరాలు కేటాయించింది. తెలంగాణకు 8.245 ఎకరాలు దక్కింది.
ఏపీ వాటాకు 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్లో 2.396 ఎకరాలు వచ్చాయి. తెలంగాణకు శబరి బ్లాక్లోని 3 ఎకరాలు, పటౌడి హౌస్లో 5.245 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ లేఖ రాసింది.
Also Read: మోదీ వైపే జగన్, చంద్రబాబు.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..
తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకరించింది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కేంద్ర హోంశాఖ ఆమోదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తైంది. అప్పటి నుంచి ఏపీ భవన్ పంపకం ఎటూ తేలలేదు. అందువల్లే ఈ ప్రక్రియ పూర్తికాలేదు. ఇన్నాళ్లకు ఏపీ భవన్ విభజన ప్రక్రియ పూర్తైంది. ఎవరికి కేటాయించిన భవనాలను ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు వినియోగించుకోనున్నాయి.