Congress : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆశావహులు ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్కు దరఖాస్తులు అందించారు. గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ, మడకశిర నుంచి సుధాకర్, బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు.
Congress : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆశావహులు ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్కు దరఖాస్తులు అందించారు. గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ, మడకశిర నుంచి సుధాకర్, బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మాణికం ఠాగూర్ తెలిపారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తర్వలోనే ఏపీలో పర్యటిస్తుందన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.