Youth Damaged Police Vehicle in Ganja Effect: ఏపీ పేరు చెప్పగానే ఈ మధ్యకాలంలో తరచు వినబడేవి డ్రగ్స్, గంజాయి. గడిచిన ఐదేళ్లలో అధికారులు భారీ ఎత్తున సీజ్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కూడా. ఒడిషా-ఏపీ బోర్డర్ నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి చేరుకుంటోంది. ఈ విషయాన్ని అధికారులు పలుమార్లు వెల్లడించారు. అంతేకాదు పట్టుబడిన నిందితులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే గంజాయికి ఏపీ కేపిటల్ అయ్యిందని రాజకీయ నేతలు బలంగా వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ యువకుడు గంజాయి మత్తులో హల్చల్ చేశాడు. మంగమూరు రోడ్డుపై హంగామా చేస్తున్న యువకుడ్ని రక్షక్ వాహన పోలీసులు మందలించారు. మత్తులో ఆ యువకుడు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డాడు. అంతేకాదు వాహనం అద్దాన్ని ఇనుపరాడ్తో పగలకొట్టాడు. యువకుడి వీరంగం చూసి కాసేపు పోలీసులు సైలెంట్ అయిపోయారు. చివరకు చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోవడంతో వారి సాయంతో యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
చెప్పుకోవడానికి ఇది ఒక ఘటన మాత్రమే. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయని అంటున్నారు. ఆ మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో కొందరు యువకులు గంజాయిని అమ్మిన సందర్భాలు ఉన్నాయి. స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ తరహా ఘటనలు చూసినవాళ్లు మాత్రం.. గడిచిన ఐదేళ్లలో గంజాయి కంట్రోల్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదికాదంటున్నారు. దీనికంతటికీ పోలీసులే కారణమన్న వాదనలు అక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.
Also Read: నోట్ల కట్టలు.. బంగారం.. లిక్కర్.. కేవలం 15 రోజులకే..
గంజాయి మత్తులో యువకుడు హల్చల్..
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక యువకుడు గంజాయి సేవించి హల్చల్ చేశాడు.
మంగమూరు రోడ్ లో రోడ్డుపై హల్చల్ చేస్తున్న యువకుడుని తాలూకా రక్షక్ వాహనం పోలీసులు మందలించడంతో ఆ యువకుడు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డాడు.
అక్కడే ఉన్న రక్షక్ వాహన ని ఇనప రాడ్ తో… pic.twitter.com/UvoAoiQf0q
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2024