E-Paper
Advertisement

Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?

Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?

Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇది ఈ నెల 9న తీవ్ర వాయుగుండంగా మారుతుందని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఈ నెల 10న వాయుగుండం.. తుపానుగా మారుతుందని వివరించింది. ఈ తుపాన్ కు యెమన్‌ దేశం ‘మోచా’గా నామకరణం చేసింది.

ఈ నెల 9న వాయుగుండం ఉత్తర దిశగా బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తరువాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదని వాతావరణశాఖ తెలిపింది. తుపాన్ పరిస్థితులపై మంగళవారం పూర్తిగా అంచనా వస్తుందని వివరించింది. ఏపీలోని ఓడరేవుల్లో ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సముద్రంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు సోమవారం సాయంత్రంలోగా ఒడ్డుకు చేరుకోవాలని హెచ్చరించింది.

తుపాన్ తీవ్రంగా మారినా ఏపీకి ముప్పులేదని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మోచా తుపాన్ మయన్మార్‌ వద్ద తీరం దాటొచ్చని విదేశీ వాతావరణ అధ్యయన సంస్థలు వెల్లడించాయి. ఒడిశాకు కూడా ముప్పు ఉండదని స్పష్టం చేశాయి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×