E-Paper
Advertisement

Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?

Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?
Advertisement

Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇది ఈ నెల 9న తీవ్ర వాయుగుండంగా మారుతుందని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఈ నెల 10న వాయుగుండం.. తుపానుగా మారుతుందని వివరించింది. ఈ తుపాన్ కు యెమన్‌ దేశం ‘మోచా’గా నామకరణం చేసింది.

ఈ నెల 9న వాయుగుండం ఉత్తర దిశగా బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తరువాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదని వాతావరణశాఖ తెలిపింది. తుపాన్ పరిస్థితులపై మంగళవారం పూర్తిగా అంచనా వస్తుందని వివరించింది. ఏపీలోని ఓడరేవుల్లో ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సముద్రంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు సోమవారం సాయంత్రంలోగా ఒడ్డుకు చేరుకోవాలని హెచ్చరించింది.

Advertisement

తుపాన్ తీవ్రంగా మారినా ఏపీకి ముప్పులేదని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మోచా తుపాన్ మయన్మార్‌ వద్ద తీరం దాటొచ్చని విదేశీ వాతావరణ అధ్యయన సంస్థలు వెల్లడించాయి. ఒడిశాకు కూడా ముప్పు ఉండదని స్పష్టం చేశాయి.

Related News

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

Big Stories

Advertisement
×