Drugs Bust In Visakhapatnam: ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా విశాఖపట్నం పోర్ట్ సమీపంలోని ఓడలో భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు గురువారం తెలిపారు. కంటైనర్లో మొత్తం 25,000 కిలోల బరువున్న కొకైన్ను ఈస్ట్ సంచులలో కలిపినట్లు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది.
మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్పోల్ ఇన్పుట్ తర్వాత, సీబీఐ ఆపరేషన్లో కస్టమ్స్ సహాయంతో నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖపట్నం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని సంధ్యా ఎక్స్పోర్ట్స్కు కంటైనర్ వచ్చినట్లు తెలిపారు. మొత్తం వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.