Money Seized in Nellore(AP latest news):
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నగదు రవాణా జోరుగా సాగుతోంది. నెల్లూరు జిల్లాలో అక్రమ నగదు రవాణా పోలీసులకు సవాల్గా మారింది. ప్రయాణికులు ముసుగులో పెద్ద ఎత్తున నగదు రవాణా చేస్తున్నారు. గురువారం పలు చోట్ల అక్రమంగా తరలిస్తున్న 12 కోట్ల 46 లక్షల 40 వేలు రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. తరలిస్తున్న డబ్బుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో డబ్బు సీజ్ చేశారు. ఆటోలు, ప్రైవేట్ బస్సు, ట్రైన్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
చెన్నైలో అక్రమమార్గాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. డబ్బు సీజ్ చేయడంతో పాటు.. డబ్బు తరలిస్తున్న వారిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కోట్ల 83 లక్షల నగదు దొరికింది. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద 1కోటి 50 లక్షల 40 వేల రూపాయలు పట్టుబడింది. గూడూరులో 5 కోట్ల 13 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.