AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే అని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఏపీ కేపిటల్ పై రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి సహాయమంత్రి కౌశల్ కుమార్ లిఖిత పూర్వంగా సమాధానం ఇచ్చారు. దేశంలో 28 రాష్ట్రాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని వివరించారు. ఈ బృహత్ ప్రణాళికలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించామని కౌశల్ కుమార్ తెలిపారు. ఈ బృహత్ ప్రణాళికకు కేంద్రం ఆమోదించిందన్నారు.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చేపట్టాలని భావిస్తోంది. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను మార్చాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. సీఎంవో కార్యాలయం, ప్రభుత్వ శాఖల ఆఫీసులను విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నెల చివరివారంలో ఈ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిపై కేంద్రం చేసిన తాజా ప్రకటన ఆసక్తిని రేపుతోంది.