KTR : తెలంగాణలో ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ కు ఘన విజయం సాధించగానే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన ఓఎస్డీ ద్వారా పంపించారు. ఆ తర్వాత ఆయన సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
బీఆర్ఎస్ ఓటమి తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక పార్టీ బాధ్యతలు తనయుడు కేటీఆర్ కే అప్పగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.