Michaung Cyclone : మిగ్జాం తుఫాన్ ప్రభావం తో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల పరిధిలో రాత్రి నుంచి ఈదురు గాలితో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురుగాలు ఎక్కువగా ఉండటంతో పలు గ్రామంలో చెట్లు నేలకొరిగాయి. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఈదురుగాలులతో కురుస్తున్న వర్షంతో, చలి ఎక్కువ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు చేరడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. ముత్తుకూరు మండలం పొట్టింపాడు గ్రామ సమీపంలోని నక్కల కాల్వ ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆయా మండలాల్లోని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.