Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుంచి వచ్చిన మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.
అగ్నిప్రమాదంలో సుమారు రూ. 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరి నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్నాయని తెలిపారు. నరసరావుపేటలో ఉన్నది మెయిన్ బ్రాంచ్ అని చెప్పారు.
అగ్నిప్రమాదం పై తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నామని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. మంటలను పూర్తిగా ఆర్పేశామని వివరించారు.