Janasena : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాభవం చవిచూసింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. పోటీ చేసిన 8 చోట్ల డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం పనిచేయలేదు. కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా రాలేదు.
తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన 8 చోట్ల పోటీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై భారీగా ఆశలు పెట్టుకుంది. అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం, వైరా స్థానాల్లో పోటీ చేసింది. ఆ నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రచారం చేశారు. నాగర్ కర్నూల్, తాండూరు, కూకట్పల్లి, కోదాడ నుంచి బరిలోకి దిగారు జనసేన అభ్యర్థులు. కానీ ఏ స్థానంలోనూ జనసేన ప్రభావం చూపలేదు.
ఏపీలో ఎన్నికల ముందు తెలంగాణలో పోటీ చేసి జనసేన తప్పటడుగులు వేసిందంటున్నారు. ఆ పార్టీకి ఎక్కడ గెలిచే ఛాన్స్ లేదని ముందు నుంచే అంచనాలున్నాయి. కనీసం కూకట్ పల్లిలోనైనా డిపాజిట్ వస్తుందని భావించారు. అక్కడ కూడా ఓట్లు పడలేదు.