Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. డీజీపీ వెంట పలువురు ఐపీఎస్ లు కూడా ఉన్నారు. రేవంత్ ఇంటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ విజయం తేలిపోవడంతో రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరారు.