EPAPER

Telangana Election Results : పార్టీ ఫిరాయించిన నేతలకు షాక్.. అశ్వారావుపేట, ఇల్లందులో కాంగ్రెస్ గెలుపు..

Telangana Election Results : పార్టీ ఫిరాయించిన నేతలకు షాక్.. అశ్వారావుపేట, ఇల్లందులో కాంగ్రెస్ గెలుపు..

Telangana Election Results : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ 70 స్థానాలు కచ్చితంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో తొలి విజయం కాంగ్రెస్ రకే దక్కింది. అశ్వారావుపేటలో జారే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 20 వేలపైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.


2018లో అశ్వారావుపేటలో టీడీపీ తరఫున పోటీ చేసి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీ ఫిరాయించారు. అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు ఓటమిపాలయ్యారు.

రెండో విజయం కూడా కాంగ్రెస్ అభ్యర్థినే వరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (ఎస్టీ) స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య .. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై 38 వేల మెజార్టీతో గెలుపొందారు.


హరిప్రియా నాయక్ కాంగ్రెస్ నుంచి 2018లో గెలిచారు. ఆ తర్వాత ఆమె పార్టీ ఫిరాయించి గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి చేతిలోనే ఆమె ఓటమి చవిచూశారు. ఇలా 2018లో గెలిచిన పార్టీ నుంచి కారెక్కిన ఇద్దరు నేతలకు ప్రజలు ఓటమిని కానుకగా ఇచ్చారు.

రామగుండంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×