Sircilla : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు సిరిసిల్లి నియోజకవర్గంలో తొలుత వెనుకబడ్డారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లలో కేటీఆర్ పుంజుకున్నారు. కేటీఆర్ లీడ్ లోకి వచ్చారు.
ఎన్నికలకు ముందే కేటీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది. ఆయన ఓడిపోతారనే టాక్ చాలాకాలంగా నడుస్తోంది. ఈ నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. తాను ఇకపై తరచూ వస్తానంటూ ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సమయం మించిపోయిందని స్థానికంగా చర్చ నడించింది.
సరైన సమయం కోసం సిరిసిల్ల ఓటర్లు వేచిచూశారు. ఎన్నికల్లో ఓటుతో కేటీఆర్ కు షాకిఇవ్వాలని భావించారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో అదే విషయం స్పష్టం కనిపిస్తోంది. తొలి రౌండ్ లో కేటీఆర్ వెనుకబడ్డారు. కానీ ఆ తర్వాత లీడ్ లోకి వచ్చిన గతంలో కంటే మెజార్టీ బాగా తగ్గే అవకాశం ఉంది.