Telangana Elections : తెలంగాణలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకే ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ సాధించారు. ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ హస్తం హవా కొనసాగుతోంది.
అనేక చోట్ల తొలిరౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. కామారెడ్డిలో రేవంత్రెడ్డి (కాంగ్రెస్), ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్), అశ్వారావుపేటలో ఆదినారాయణ (కాంగ్రెస్), హుజూర్నగర్లో ఉత్తమ్కుమార్రెడ్డి (కాంగ్రెస్), తుంగతుర్తిలో శామ్యూల్ (కాంగ్రెస్), మధిరలో మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్) లీడ్ సాధించారు.
గజ్వేల్లో కేసీఆర్, గోషామహల్లో రాజాసింగ్ (బీజేపీ), ఆదిలాబాద్లో పాయల్ శంకర్ (బీజేపీ) ముషీరాబాద్లో ముఠా గోపాల్ (బీఆర్ఎస్), సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్) ముందంజలో ఉన్నారు.