Telangana Elections : ప్రీపోల్ అంచనాలు నిజమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ గా మారుతున్నాయి. అందరూ ఊహించిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గాలి బలంగా వీచింది. ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. 50 పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. బీఆర్ఎస్ దాదాపు 25 స్థానాల్లో మాత్రం ఆధిక్యం తెచ్చుకుంది.
పరకాలలో రేవూరి ప్రకాశ్రెడ్డి(కాంగ్రెస్), పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్), నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (కాంగ్రెస్), మునుగోడులో రాజగోపాల్ రెడ్డి, మధిరలో మల్లు భట్టి విక్రమార్క , వర్ధన్నపేటలో కె.ఆర్.నాగరాజు (కాంగ్రెస్) ఆధిక్యంలో ఉన్నారు. బెల్లంపల్లిలో వినోద్ (కాంగ్రెస్), ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్), మంచిర్యాలలో ప్రేమ్సాగర్ రావు (కాంగ్రెస్), ములుగులో సీతక్క (కాంగ్రెస్), పరిగిలో రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్), మాలోతు రాందాస్ (కాంగ్రెస్), గోషామహల్లో రాజాసింగ్ (బీజేపీ), చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ (ఎంఐఎం) ఆధిక్యంలో ఉన్నారు.
ముందుగా పోస్టల్, సర్వీస్ ఓట్లను లెక్కించారు. చాలా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఖమ్మం 9 స్థానాల్లో కాంగ్రెస్, ఒక చోట సీపీఎం లీడ్లో ఉన్నాయి.