Kodangal : తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠగా చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొండగల్ పై అందరి దృష్టి ఉంది. కొండగల్ ఓటర్లు రేవంత్ కే పట్టం కడతారనే తొలి నుంచి అంచనాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ లో ఆయనకే ఆధిక్యం లభించింది. 9 రౌండ్ ముగిసే సరికి 11 వేల ఓట్ల లీడ్ లోకి వెళ్లారు. కౌంటింగ్ ముగిసే సరికి రేవంత్ 32వేల 800 మెజార్టీతో విజయభేరి మోగించారు.
రేవంత్ రెడ్డి తన భుజస్కందాలపై కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపట్టిన రాష్ట్రమంతా చుట్టేశారు. ఆయన కొడంగల్ లో ప్రచారం చేసే సమయం తక్కువే దొరికింది. కానీ ఆయనకు నియోజకవర్గంలో ఎంతో పట్టుంది. అక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలు నుంచి రేవంత్ గెలుపు నల్లేరుపై నడకేనన్న అంచనాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ అదే జోరు కొనసాగించింది. రేవంత్ ను భారీ విజయం వరించింది.