Four States Results: తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను.. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 70 స్థానాల్లోనైనా గెలిచి తీరాలి. అలాగే మధ్యప్రదేశ్ లో 230 స్థానాలుండగా.. అధికారం రావడానికి 116 స్థానాల్లో విజయం సాధించాలి. రాజస్థాన్ లో 199 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 100గా ఉంది. ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలుండగా 46 స్థానాల్లో విజయం తప్పనిసరి. ఈ నాలుగు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే.. మూడింట కాంగ్రెస్ దే విజయమని చెప్పాయి. రాజస్థాన్ లో మాత్రం గెలుపుకు 50-50 అవకాశాలున్నట్లు సర్వేలు వెల్లడించాయి.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడి కానుండగా.. అక్కడ హంగ్ తప్పదని స్పష్టం చేశాయి. ఆదివారం ఒక్కరోజే నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడుతుండగా.. కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే తెలంగాణలో గెలుపు గుర్రాలను కాపాడుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులను రాష్ట్రానికి పంపింది. గెలిచిన అభ్యర్థులకు ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇచ్చి.. తాజ్ కృష్ణకు తరలించనున్నారు.