KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎనిక్నల కమిషనర్ వికాస్ రాజ్పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో శనివారం మీడియాతో కేఏ పాల్ మాట్లాడుతూ.. సీఈవో వికాస్ రాజ్ అవినీతి చక్రవర్తిగా మారుతున్నారని ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు వికాస్ రాజ్పై కంప్లైంట్ చేశామన్నారు.
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎనిక్నల కమిషనర్ వికాస్ రాజ్పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో శనివారం మీడియాతో కేఏ పాల్ మాట్లాడుతూ.. సీఈవో వికాస్ రాజ్ అవినీతి చక్రవర్తిగా మారుతున్నారని ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు వికాస్ రాజ్పై కంప్లైంట్ చేశామన్నారు.
ఎన్నికల ముగిసిన తరువాత కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని పాల్ మండిపడ్డారు. వికాస్ రాజ్ను కేసీఆర్ డబ్బుతో కొనేశారా..? అన్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దగ్గర పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులు ఎందుకు ఎన్నికల అధికారులు సీజ్ చేయలేదన్నారు. తాను చెప్పినందుకే హైదరాబాద్ ప్రజలు.. నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారన్నారు. ఓటమి భయంతో కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రలోభ పెట్టి కొనేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ 58-63 సీట్లు వస్తాయని కేఏపాల్ జోస్యం చెప్పారు.