YS Sharmila Son: వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో కలిసి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రెడ్డి, కమ్మ వర్గాల మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆ రెండు వర్గాల రాజకీయాలు నాటి నుంచి నేటి వరకూ కాకరేపుతుంటాయి. రెడ్డి వర్సెస్ కమ్మ పాలిటిక్స్ నేపథ్యంలోనే ఇప్పటి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్ షర్మిల తనయుడి పెళ్లి పొలిటికల్గా చర్చకు దారి తీస్తుందని వార్తలొస్తున్నాయి.
USAలో చదువుకుంటున్న షర్మిల తనయుడు రాజారెడ్డి నాలుగేళ్లుగా అట్లూరి ప్రియతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు చెప్తున్నారు. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం. అయితే.. వీరిద్దరి వివాహం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా అని ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.