తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఓ యువకుడిని బోరబండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
బోరబండ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను.. అదే పరిసర ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ కె. సాయి కుమార్ (24) ప్రలోభపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. గత వారం రోజుల నుంచి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.
విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి బోరబండ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసి సాయికుమార్ను అరెస్టు చేశారు. అతడిని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మానసిక మద్దతు కోసం భరోసా కేంద్రానికి పంపారు.