Fire Accident In Tourism Office : తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై అనేక అనుమానాలు రేకుత్తుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు హిమాయత్నగర్లోని టూరిజం హెడ్ ఆఫీస్ ఫస్ట్ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి.
తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వచ్చిన తర్వాత ప్రమాదం జరగడంపై ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. కార్యాలయంలో ఉన్న ఫైల్స్ దగ్ధం చేయడానికే ఈ ప్రమాదాన్ని సృష్టించారనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నిర్ణయాలపై ఇప్పటికే పలు వివాదాలు ఉన్నాయి.
టూరిజం కార్పొరేషన్ ఓఎస్డీ మనోహర్ను ఇటీవలే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. గతంలో టూరిజం శాఖ ఛైర్మన్గా పనిచేసిన శ్రీనివాస గుప్తా పైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే చిక్కులు తప్పవనే ఆలోచనతోనే ఈ ప్రమాదాన్ని సృష్టించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు పర్యాటక శాఖ సిబ్బంది.