Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? తెలుగు రాష్ట్రాల మధ్య రెండు రోజులుగా రచ్చ రచ్చ జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? మా హక్కులు మేం సాధించుకోవడం తప్పెలా అవుతుందంటూ అటు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకొచ్చారు. మా వాటా నీటిని మేం విడుదల చేసుకునే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారాయన.
ఇటు, తెలంగాణలో సాగునీటి మంత్రిత్వ శాఖ కూడా సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది. అయినప్పటికీ ఒక్క మాట కానీ, ప్రకటన కానీ వెలువడకపోవడంపై చర్చ జరుగుతోంది. అటు.. నాగార్జున సాగర్ డ్యాం.. రెండు రాష్ట్రాల పోలీసుల వలయంలో ఉంది. ఏపీ పోలీసులపై తెలంగాణ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేశారు. మరోవైపు రాజకీయ అవసరాల కోసమే నాగార్జున సాగర్ డ్యాం ఇష్యూని తెరపైకి తెచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది.