Telangana Elections : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే విజయమని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో తుది ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది. తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను అక్కడకు తరలించి భద్రపరిచారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేశారు.
మరోవైపు పోలీసులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్ద పకడ్బందీ బందోబస్తు పెట్టారు. అక్కడకి ఎవరినీ అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమైన అరగంట నుంచే ట్రెండ్స్ వెలువడతాయి. మధ్యాహ్నానికి కౌంటర్ పూర్తయ్యే అవకాశం ఉంది.
కౌంటింగ్ కేంద్రాల వివరాలివే..!