కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్న ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో బోటులో మంటలు వ్యాపించాయి. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో వారు చిక్కుకుపోయారు. ఆ సమయంలో వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. 11 మంది మత్స్యకారులును రక్షించారు. వారిని సురక్షింగా మరో బోటులోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు.
11 మంది మత్స్యకారులు బోటుపై వేటకు వెళ్లారు. నడి సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్నారు. కోస్ట్గార్డ్ సిబ్బంది సమయస్ఫూర్తితో వెళ్లి వారిని కాపాడారు. ఎటుపోవాలో అర్థంకాని పరిస్థితి. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన మత్స్యకారులను కోస్ట్గార్డ్ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.