Mizoram Exit polls | ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. 78.40 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40 సీట్లున్న మిజోరం అసెంబ్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 21 సాధించాలి.
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. 78.40 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40 సీట్లున్న మిజోరం అసెంబ్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 21 సాధించాలి. మిజోరం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జోరంతంగా నాయకత్వంలో మిజో నేషనల్ ఫ్రంట్ 2018 నుంచి అధికారంలో ఉంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్కు వ్యతిరేకంగా ఆరు ప్రాంతీయ పార్టీల కూటమి జోరం పీపుల్ ఫ్రంట్. మిజోరం ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూద్దాం.
ఇండియా టివి సిఎన్ఎక్స్ సర్వే
MNF 14-18
ZPM 12-16
కాంగ్రెస్ 8-10
జన్ కీ బాత్ సర్వే
MNF 12-14
ZPM 15-25
కాంగ్రెస్ 5-9
బిజేపీ 0-2
ఇతరులు 1-5
పిపుల్ పల్స్ సర్వే
MNF 16-20
ZPM 12-17
కాంగ్రెస్ 6-10
పోల్ ఆఫ్ పోల్స్ సర్వే
MNF 14
ZPM 17
కాంగ్రెస్ 8
బిజేపీ 1
ఇంతకుముందు 2018 ఎన్నికల తరువాత బిజేపీ సహకారంతో MNF పార్టీ 26 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో హంగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కింగ్ మేకర్ పాత్ర పోషించగలదని చెప్పవచ్చు. ఎందుకంటే మిజోరంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.