AP Fibrenet Case : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఊరట లభించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు పిటిషన్ కోసం నవంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదన విన్న అత్యున్నత కోర్టు డిసెంబర్ 12న విచారణ వాయిదా చేసింది.
AP Fibrenet Case : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఊరట లభించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు పిటిషన్ కోసం నవంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదన విన్న అత్యున్నత కోర్టు డిసెంబర్ 12న విచారణ వాయిదా చేసింది.
విచారణ జరిగేంతవరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్ర ప్రదేశ్ సిఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు జరిగిన విచారణ సమయంలో సుప్రీం కోర్టు.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తరువాతనే బెయిల్ పిటిషన్ను పరిశీలిస్తామని తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకపోవడంతో ఇప్పుడు విచారణను మరోసారి వాయిదా వేసింది.