Telangana Polling : తెలంగాణలోని నక్సల్ ప్రభావితమైన 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాలు కావడంతో పోలింగ్ సమయాన్ని కుదించారు.
Telangana Polling : తెలంగాణలోని నక్సల్ ప్రభావితమైన 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాలు కావడంతో పోలింగ్ సమయాన్ని కుదించారు.
సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, ములుగు, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కానీ 4 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి నిలబడిన ఓటర్లను లోపలికి అనుమతించారు. మిగతా 106 నియోజకవర్గాల్లో తెలంగాణవ్యాప్తంగా 5 గంటలవరకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల లోపు 51.89 శాతం పోలింగ్ నమోదైంది. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా 70.48 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా యాకూత్ పురాలో 20.09శాతం పోలింగ్ నమోదైంది.