Pulipati Rajesh : కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ పై పాతబస్తీలో ఎంఐఎం నాయకులు దాడి చేశారు. బహదూర్ పుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రాజేష్పై పాతబస్తీ హుస్సేనిఆలం ప్రాంతంలో దాడి జరిగింది.
Pulipati Rajesh : కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ పై పాతబస్తీలో ఎంఐఎం నాయకులు దాడి చేశారు. బహదూర్ పుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రాజేష్పై పాతబస్తీ హుస్సేనిఆలం ప్రాంతంలో దాడి జరిగింది.
గురువారం పోలింగ్ జరుగుతన్న సమయంలో ఓషియన్ పబ్లిక్ స్కూల్ వద్ద పోలింగ్ బూత్ ను కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ పరిశీలించడానికి వెళ్లారు. అదే సమయంలో ఎంఐఎం నాయకులు అక్కడికి రావడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అలా గొడవ పెరిగి ఎంఐఎం నాయకులు రాజేష్పై దాడి చేశారు. ఈ దాడిలో రాజేష్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కలుగజేసుకొని వెంటనే రాజేష్కు ఆస్పత్రికి తీసుకెళ్లారు.