Cash for Vote : జనగామలో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్న తమను బిఆర్ఎస్ నాయకులు పిలిచారని.. ఓటేసేందుకు వస్తే బస్సు కిరాయి రూ.500, ఓటు వేసినందుకు రూ.2000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఓటర్లు మండిపడ్డారు.
Cash for Vote : జనగామలో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్న తమను బిఆర్ఎస్ నాయకులు పిలిచారని.. ఓటేసేందుకు వస్తే బస్సు కిరాయి రూ.500, ఓటు వేసినందుకు రూ.2000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఓటర్లు మండిపడ్డారు. ఈ ఘటన జనగామ్ చేర్యాల మండలం అకునూరు గ్రామంలో జరిగింది.
ఓటు వేసేందుకు అంత దూరం నుంచి వస్తే.. డబ్బులిచ్చే మధ్యవర్తి తమను పోలింగ్ సమీపంలో నిలబెట్టి వెళ్లిపోయాడని.. అతనో కోసం ఎదరుచూసినా రాలేదని చెబుతున్నారు. డబ్బులిచ్చే వరకు ఓటు వేసేది లేదని ఓటర్లు ఆందోళన చేయడంతో పోలిసులు రంగంలోకి దిగారు. ఓటర్లను సర్దిచెప్పి పరిస్థితిని అదుపు చేశారు.