EC : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో అనేక చోట్ల నేతలు కోడ్ ఉల్లంఘిస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ నేతలు ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధంగా పొలిటికల్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఇలాంటి లీడర్స్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ ఫోకస్ చేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈసీ చర్యలు చేపట్టింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలుస్తోంది.
మరో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంల సమస్య వచ్చిన చోట కొత్తవి ఇచ్చామని చెప్పారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ మందకొడిగా జరుగుతుందని ప్రకటించారు. చెరుదుమదురుగా చిన్న ఘర్షణలు జరిగాయన్నారు. ప్రతి ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని డీఈవోను కోరామన్నారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చిందని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు . కవితపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందన్నారు.
అసలు కవితపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదైందంటే.. ఓటు వేసిన ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీంతో కవిత ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత నిరంజన్. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
అలాగే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో పార్టీ కండువాతో వచ్చి ఓటు వేశారని మంత్రిపై అధికారులు నిర్మల్ గ్రామీణ పీఎస్ లో ఫిర్యాదుచేశారు.