Telangana Polling: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు నిదానంగా వస్తున్నారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ కు బ్రేక్ పడింది. ఉదయం 1 గంట వరకూ 36.68 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారిగా చూస్తే.. ఆదిలాబాద్ లో 41.88 శాతం, ములుగులో 45.69 శాతం, భద్రాద్రి 39.29 శాతం, హనుమకొండ 35.29 శాతం, హైదరాబాద్ 20.79 శాతం, జగిత్యాల 46.14 శాతం, జనగామ 44.31 శాతం, భూపాలపల్లి – 49.12 శాతం, గద్వాల 49.29 శాతం, కామారెడ్డి 40.78 శాతం, కరీంనగర్ 40.73 శాతం, ఖమ్మం -42.93 శాతం, కుమురం భీం -42.77 శాతం, మహబూబాబాద్ 46.89 శాతం, మహబూబ్ నగర్ 44.93 శాతం, మంచిర్యాల -42.74 శాతం, మెదక్ -50.80 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి 26.70 శాతం, ములుగు -45.69 శాతం పోలింగ్ నమోదైంది.
నాగర్ కర్నూల్ -39.58, నల్గొండ -39.20 శాతం, నారాయణపేట -42.60 శాతం, నిర్మల్ 41.74 శాతం, నిజామాబాద్ 39.66 శాతం, పెద్దపల్లి – 44.49 శాతం, రాజన్న సిరిసిల్ల 39.07 శాతం, రంగారెడ్డి -29.79 శాతం, సంగారెడ్డి -42.17 శాతం, సిద్ధిపేట – 44.35 శాతం, సూర్యాపేట 44.14 శాతం, వికారాబాద్ 44.85 శాతం, వనపర్తి -40.40 శాతం, వరంగల్ 37.25 శాతం, యాదాద్రి భువనగిరి -45.07 శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు సైతం ఆక్సిజన్ సిలిండర్లు వెంటబెట్టుకుని మరీ తమ ఓటుహక్కును వినియోగించుకుంటూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.