Hyderabad Polling : తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత, మహిళలతో పాటు వృద్ధులు కూడా వస్తున్నారు. పలు ప్రదేశాల్లో అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. ఓటు వేసేందుకు బద్దకం చూపిస్తున్న వారికి ఇలాంటి ఓటర్లు ఆదర్శం.
Hyderabad Ideal voters: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత, మహిళలతో పాటు వృద్ధులు కూడా వస్తున్నారు. పలు ప్రదేశాల్లో అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. ఓటు వేసేందుకు బద్దకం చూపిస్తున్న వారికి ఇలాంటి ఓటర్లు ఆదర్శం.
ఉదాహరణకు లివర్ సమస్యతో బాధపడుతున్న 75 ఏళ్ల శేషయ్య అనే వ్యక్తి హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఓటు వేసేందుకు ఆక్సిజన్ సిలిండర్తో వచ్చారు. గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్లో పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు వేశారు. 1966 సంవత్సరం నుంచి ఆయన అన్ని ఎన్నికల్లో ఓటు వేశానని మీడియాతో చెప్పారు. ఓటు వేయడం తన హక్కుతో పాటు బాధ్యత కూడా అని పేర్కొన్నారు.
అలాగే ఆస్తమా వల్ల తీవ్ర శ్వాస సమస్యతో బాధపడుతున్న మరో సీనియర్ సిటిజెన్ లక్ష్మీ శ్యాంసుందర్ ముషీరాబాద్ గాంధీనగర్లో ఎస్బీఐ కాలనీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకవైపు హైదరాబాద్లో ఓటర్ల బద్దకం వల్ల అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండగా.. ఇలాంటి వారు పోలింగ్ కేంద్రాలకు ఎన్ని సమస్యలున్నా తమ బాధ్యతగా వస్తున్నారు.