Telangana Elections | బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కేడర్ను పిలిచి తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు బుధవారం నిర్వహించడం ఒక విధంగా ఓటర్లను ప్రభావితం చేయడమేనని ఇలా చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ఛైర్మన్ జి.నిరంజన్
Telangana Elections | బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కేడర్ను పిలిచి తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు బుధవారం నిర్వహించడం ఒక విధంగా ఓటర్లను ప్రభావితం చేయడమేనని ఇలా చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ఛైర్మన్ జి.నిరంజన్ ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేశారు.
ఓటర్లను ప్రభావితం చేయడానికే బిఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 144 సెక్షన్ విధించగా.. ఎన్నికల నియమావళి, మీడియాపై ఆంక్షలు ఉన్నాయని.. ఇలాంటి సమయంలో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించడం అనేది కేవలం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఆయన లేఖలో వివరించారు.
మంత్రి కేటీఆర్పై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీని కోరారు.