Padi Kaushik Reddy : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాలని..తక్షణమే నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది
Padi Kaushik Reddy : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాలని..తక్షణమే నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ప్రచారం చివరి రోజు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
తనకే ఓట్లు వేసి గెలిపించాలని అలా చేస్తే విజయ యాత్రకు వస్తానని.. లేకుంటే డిసెంబర్ 4వ తేదీన తన శవయాత్రకు రావాల్సి ఉంటుందని ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ స్పీచ్ లు ఇచ్చారు కౌశిక్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ గ్రామంలో కౌశిక్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తనను ఓడిస్తే తనతోపాటు భార్య, కుమార్తె శవాలను చూడాల్సి ఉంటుందని కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్గా బెదిరించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ నివేదిక కోరింది.