Money Seized : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు కొన్ని గంటల ముందు భారీగా నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నోట్ల కలకలం రేగింది. రెండు కార్లలో తరలిస్తున్న కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల నగదును రాయదుర్గం , మాదాపూర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖాజాగూడలో వెహికల్స్ తనిఖీలు చేస్తుండగా కార్లలో నగదు దొరికింది. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బుని SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుని సీజ్ చేసిన పోలీసులు… డబ్బు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఈ డబ్బు ఎవరిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా,ఈ నగదు జడ్చర్ల కు చెందిన ఓ పార్టీ అభ్యర్థికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిజ్ చేసిన నగదను ఐటీ అధికారులకు రాయదుర్గం పోలీసులు అప్పగించారు.