Election Commission | నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు అన్ని విద్యా సంస్థలు, కంపనీలు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు అన్ని విద్యా సంస్థలు, కంపనీలు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు ఆ రోజు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని లేని పక్షంలో అలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ హెచ్చరించారు.
గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోవడంతో ఆ సమయంలో ఫిర్యాదులు వచ్చాయని గుర్తుచేశారు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలోని అన్ని కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు సెలవు ఇచ్చాయో లేదో చూడాలని కార్మిక శాఖకు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సెలవు ఇవ్వని కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.