Postal Ballots | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఆర్వో కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వినియోగించుకున్న ఓట్లు.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఆర్వో కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వినియోగించుకున్న ఓట్లు.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని ఆరోపించారు. మూడు రోజులుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేసి.. చివరికి పోరాటం ద్వారా ఓటుహక్కు సాధించుకున్నామని..బ్యాలెట్ బాక్స్ వద్ద సీసీ కెమెరాలు పెట్టి.. తాము ఎవరికి ఓటు వేశామో.. పూర్తిగా రికార్డ్ చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగుల ఆందోళనకు స్థానిక బీజేపీ నేతలు మద్దతు పలికారు. ఉద్యోగుల ఆందోళనతో బ్యాలెట్ బాక్స్ పొజిషన్ మార్చినా.. సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఉదయం నుంచి ఓటు కోసం చంటి పిల్లలతో వచ్చి ఆందోళన చేస్తే… వేసిన ఓటు.. ఇలా సీసీ కెమెరాల్లో చిత్రీకరణ అవడంపై పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు.